Tuesday, January 27, 2026

'చెర'వులు ఏల?

'చెర'వులు ఏల? చెరువుల రక్షణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయండి న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి • గ్రేటర్ చెరువుల సమస్యలపై హైకోర్టుకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల రక్షణకు పలు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్టీ ఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణయించాలని, శిథిలాలు, చెత్తవేస్తే జరిమానా విధించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. 3 రోజుల పాటు నగరంలోని 13 చెరువులను పరిశీలించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్సీ) గాడి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు నివేదికను హైకోర్టుకు అందజేసింది. ఒక్కో చెరువు వారీగా సమస్యలను ఫొటోలతో సహా నివే దికలో పొందుపర్చింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణ గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్ విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎసీజీ, జీపీ కమిటీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ నివేదికను హైకోర్టుకు అందజేసింది. నివేదికలోని అంశాలివి.. తనిఖీ చేసిన చెరువులు ఇవి.. దుర్గంచెరువు(మాదాపూర్), సున్నం చెరువు (అల్లాపూర్), మేడికుంట (నానక్రాంగూడ), గోసాయికుంట(గౌలిదొడ్డి), పెద్దచెరువు (నల్లగండ్ల), పెద్ద చెరువు (గంగారామ్), మద్దెలకుంట (బైరామల్ గూడ), నల్లచెరువు (ఉప్పల్), పెద్దచెరువు (ఫిర్జాదిగూడ). అంబీర్చెరువు (కూకట్పల్లి), చిన్నదామర చెరువు (దుండిగల్), చిన్న నారాయణయుని చెరువు(అల్వాల్), బోయిన్చెరువు (హస్ మత్ పేట్) ముఖ్యంగా పరిశీలనకు వచ్చిన అంశాలివి... శిథిలాలు, చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం కారణంగా చెరువులు పూడుకుపోయాయి. • చుట్టూ ఈ పూడిక కారణంగా చెరువుల వైశాల్యం క్షీణిస్తూ వచ్చింది. • నాలాలు, కనెక్టింగ్ చానెళ్లలో ఆక్రమణలు, డంపింగ్ సమస్య తీవ్రంగా ఉంది. * పర్యవేక్షణా యంత్రాంగం పట్టించుకోలేదు. • కొన్నిచోట్ల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావించినా చట్టపరమైన వివాదాలు వారికి అడ్డంకిగా మారాయి. ఆక్రమణలు, కాలుష్యం తగ్గించడానికి సూచనలు.. • చెరువులకు సంబంధించి పెండింగ్ ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్/ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. పట్టా భూములపై ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్)/ బఫర్ కోసం ప్రాథమిక నోటిఫికేషన్లు శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. భవిష్యత్లో వివాదాలను నివారించడానికి పట్టాదార్లకు తగిన నోటీసు అందించిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు ఉండాలి. ఎఫ్ఎఎల్/బఫర్ కోసం ప్రతిపాదించిన పట్టా భూములకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదా సదరు భూ యజమానులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములను అందించాలి. * ఒకవేళ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లను ప్రచురిస్తే.. దానిపై శాస్త్రీయ, సరైన సమీక్షను నిర్వహించవచ్చు. ఇది ఎఫ్ఎఎల్కు భవిసత్తు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సక్రమంగా నిర్వహణ ఉండేందుకు దోహదం చేస్తుంది. శాస్త్రీయత కోసం అధికారులు గ్రామ పటాలు, చెరువుల ఆకృతులు, ఆన్ సైట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. * ఆక్రమణకు పాల్పడినా, చెరువుల్లో కాలుష్య కారకాలను వదిలినా జరిమానా విధించాలి. దీని కోసం నీటి పారుదల శాఖలో ఓ నిర్దిష్ట విభాగాన్ని నెలకొల్పి అధికారాలు ఇవ్వాలి.

'చెర'వులు ఏల?

'చెర'వులు ఏల? చెరువుల రక్షణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయండి న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి • గ్రేటర్ చెరువుల సమస్యలపై...